ఐదు టెస్టుల సిరీస్ కు తెరలేచింది... టీమిండియాపై టాస్ గెలిచిన ఇంగ్లాండ్

  • భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం
  • లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్ట్ మ్యాచ్
  • టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది
  • మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు టెస్టుల సిరీస్‌కు తెరలేచింది. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో నేడు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది.

యువ కెప్టెన్ గిల్ నాయకత్వంలో బరిలో దిగిన భారత్ ఈ సిరీస్ ను చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, సొంతగడ్డపై బెన్ స్టోక్స్ సేనను తక్కువగా అంచనా వేయలేం. బజ్ బాల్ క్రికెట్ తో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ తమకు అనుకూలమైన పరిస్థితుల్లో చెలరేగిపోతుంది. దాంతో ఈ సుదీర్ఘ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జట్ల వివరాలు
భారత జట్టు (ప్లేయింగ్ ఎలెవన్): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

ఇంగ్లాండ్ జట్టు (ప్లేయింగ్ ఎలెవన్): జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.


Shubman Gill
India vs England
Test Series
Ben Stokes
Cricket
India Cricket
England Cricket
Headingley
Leeds
Jasprit Bumrah

More Telugu News